Saturday, April 13, 2024

మీ ఇంట్లో AC వినియోగిస్తున్నారా... అయితే విద్యుత్‌ ఛార్జీలను ఎలా తగ్గించుకోవాలో తెలుసా??

వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు కారణంగా వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది ఇళ్లు, కార్యాలయాల్లో AC (ఎయిర్‌ కండిషనర్‌) వినియోగం అధికం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువ గంటలపాటు AC ఆన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్‌ ఛార్జీలు కూడా అధికంగా వస్తాయి.


అయితే గతంతో పోలిస్తే పట్టణాల్లో, నగరాల్లో ఏసీల వినియోగం ఎక్కువైంది. ఈ పరిస్థితి గ్రామాల్లోనూ కనిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏసీల వినియోగం ఎక్కువగా ఉంటోంది. దీంతో మిగిలిన కాలాలతో పోలిస్తే వేసవిలో ఎక్కువ విద్యుత్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని చిట్కాల ద్వారా విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించవచ్చు.


క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయించాల్సి ఉంటుంది : ఇంట్లో లేదా కార్యాలయాల్లో వినియోగించే AC లను క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయించాల్సి ఉంటుంది. ఫలితంగా ఏసీ సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంతోపాటు ఏసీ ఫిల్టర్లను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేయించాల్సి ఉంటుంది. ఫలితంగా అక్కడ దుమ్ము, దూళి చేరేందుకు అవకాశం ఉండదు. ఏసీ ఫిల్టర్‌ సహా ఇతర సమస్యలు ఉండే ఎయిర్‌ కండిషనర్‌ సక్రమందా పనిచేసేందుకు ఎక్కువ విద్యుత్‌ అవసరం అవుతుంది. అదే ఇలాంటి సమస్యలను క్రమం తప్పకుండా పరిష్కరిస్తే ఏసీ పనిచేసేందుకు ఎక్కువ విద్యుత్‌ అవసరం ఉండదు. ఫలితంగా విద్యుత్‌ ఆదా అవుతుంది.


కిటీకీలు మరియు డోర్లు మూసి వేయాలి : ఏసీ వినియోగిస్తున్న సమయంలో ఇంట్లోని కిటికీలు, తలుపులు మూసి వేయాల్సి ఉంటుంది. ఇవి తెరిచి ఉంటే ఇంటిని చల్లగా ఉంచేందుకు ఎయిర్‌ కండిషనర్‌కు ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది. దీంతోపాటు చల్లని గాలి బయటకు వెళ్లకుండా కర్టెన్‌లు వంటివి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది.


24 గంటలు వినియోగించవద్దు.. : ఇంట్లోని AC లను 24 గంటలపాటు నిరంతరం ఉపయోగించకూడదు. ఇలా చేస్తే పరికరాలు వేగంగా డ్యామేజీ కావడంతోపాటు విద్యుత్‌ ఛార్జీలు అధికంగా వస్తాయి. అందువల్ల AC లకు టైమర్‌ను ఏర్పాటుచేసి ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అయ్యేలా చూడాలి. దీంతోపాటు కొందరి ఇళ్లలో ఒకటి కంటే ఎక్కువ AC లను వినియోగిస్తుంటారు. అయితే అన్నింటిని ఒకేసారి వినియోగించడం వల్ల ఎక్కువ విద్యుత్‌ వినియోగం జరుగుతుంది. ఫలితంగా నెలవారీ విద్యుత్‌ ఛార్జీలు అధికంగా వస్తాయి. అందరూ ఒకేసారి AC లు వినియోగించకపోవడం ఉత్తమం. Public Wi-Fi పబ్లిక్‌ వైఫైని ఎక్కువగా వినియోగిస్తున్నారా.. ఇలా చేయకుంటే డేంజర్‌లో ఉన్నట్టే..!! 



ఫ్యాన్‌ వినియోగం : ఎయిర్‌ కండిషనింగ్ ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా గది మొత్తం వ్యాపించేలా చిన్న ఫ్యాన్‌ ను వినియోగించవచ్చు. దీంతోపాటు ఎయిర్‌ కండిషనర్‌ను గదిని అత్యంత చల్లగా చేసేందుకు కాకుండా ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రత వద్ద వినియోగించడం అలవాటు చేసుకోండి. దీంతోపాటు తక్కువ విద్యుత్‌ వినియోగించి, సమర్థవంతంగా పనిచేసే ACలను కొనుగోలు చేయడం ఉత్తమం. అధిక స్టార్‌ రేటింగ్‌లు ఉన్న AC లు తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి. దీంతోపాటు మీకు ఎక్కువ కాలం పాటు ఒకే ACని వినియోగిస్తుంటే, దాని స్థానంలో కొత్తది కొనుగోలు చేయడం ఉత్తమం. అయితే ప్రతిసారి కొత్తది కొనుగోలు చేసేందుకు సాధ్యం కాదు. అయితే ఎక్కువ సమస్యలున్న AC ని అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

 

Thursday, April 11, 2024

ఈద్-ఉల్-ఫితర్ ఉపవాస దీక్షలు ముగించి పండగను జరుపుకుంటున్న మస్లిం సోదరులందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు  
M.Mahesh




 

Tuesday, February 27, 2024

షారుఖ్ ఖాన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన జాన్ సీనా.. కారణమేంటో తెలుసా?

 

ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్స్‌ జాన్‌ సీనాకు భారతదేశం అంటే ప్రత్యేకమైన ప్రేమ. అతను తరచుగా భారతీయులు, ఆచార వ్యవహారాల గురించి మాట్లాడుతుంటాడు. అలాగే భారతీయ సినిమాల గురించి పోస్ట్ చేస్తాడు. తాజాగా ఆయన షారుఖ్‌ ఖాన్‌పై ఓ పాట పాడారు. ఈ వీడియో చూసిన కింగ్ ఖాన్‌ సోషల్ మీడియా వేదికగా జాన్ సీనాకు..




ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్స్‌ జాన్‌ సీనాకు భారతదేశం అంటే ప్రత్యేకమైన ప్రేమ. అతను తరచుగా భారతీయులు, ఆచార వ్యవహారాల గురించి మాట్లాడుతుంటాడు. అలాగే భారతీయ సినిమాల గురించి పోస్ట్ చేస్తాడు. తాజాగా ఆయన షారుఖ్‌ ఖాన్‌పై ఓ పాట పాడారు. ఈ వీడియో చూసిన కింగ్ ఖాన్‌ సోషల్ మీడియా వేదికగా జాన్ సీనాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాదు తన లేటెస్ట్ పాటలను వారికి పంపుతామని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై జాన్ సీనా కూడా వెంటనే స్పందించారు. ‘మీ సినిమాలతో ప్రపంచంలో ఎంతో మందిని సంతోష పరుస్తున్నారు. మీరు చేస్తున్న పనికి థ్యాంక్స్ సార్ ‘ అంటూ రిప్లై ఇచ్చారు జాన్ సీనా. ప్రస్తుతం ఈ సూపర్ స్టార్స్ సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇటీవల జాన్ సీనా జిమ్‌లో షారుక్ ఖాన్ ‘దిల్ తో పాగల్ హై’ సినిమాలోని ‘బోలి సి సూరత్..’ పాడటానికి ప్రయత్నించాడు. అతనికి భారతీయ మల్లయోధుడు ఈ పాటను నేర్పించాడు. ఈ వీడియో చూసి షారూఖ్ చాలా సంతోషించాడు. సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. ‘ ఇద్దరికీ ధన్యవాదాలు. నాకు అది నచ్చింది. లవ్ యు జాన్ సీనా. నేను నా లేటెస్ట్ పాటలను కూడా పంపుతున్నాను. మీరిద్దరూ పాడాలి’ అని షారుఖ్ అభ్యర్థించాడు. ఈ ట్వీట్ ను చూసిన జాన్ సీనా కూడా వెంటనే షారుక్ కు రిప్లై ఇచ్చాడు. తన సినిమాలతో ఎంతోమందిని సంతోష పరుస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాడు.


ఇక సినిమాల విషయానికి వస్తే.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ తో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు షారుఖ్ ఖాన్. కింగ్ ఖాన్ నటించిన’పఠాన్’, ‘జవాన్’, ‘డంకీ’ బ్లాక్ బస్టర్స్‌ మూవీస్‌ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. దీంతో షారుక్‌ తదుపరి సినిమాల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి షారుక్‌ అప్ డేట్స్ ఇచ్చే అవకాశముంది.



GaganYan Project: 'గ‌గ‌న్ యాన్‌' ద్వారా అంత‌రిక్షంలోకి వెళ్లే వ్యోమ‌గాములు వీరే: ప్ర‌ధాని మోడీ వెల్ల‌డి......


`న్ యాన్‌` భార అంతరిక్ష రిశోధ సంస్థ చేపట్టనున్న ప్రయోగం ఇది. దీని ద్వారా వ్యోమగాములను భారత్ తొలిసారి అంతరిక్షంలోకి పంపించనుంది. ప్రధాని రేంద్ర మోడీ దీనిపై తాజా ప్ర చేశారు


`గ‌గ‌న్ యాన్‌` ద్వారా అంత‌రిక్షంలోకి వెళ్లే వ్యోమ‌గాములు వీరే


'Gagan Yan` News: అంత‌రిక్ష రంగం(Space)లో ప్ర‌పంచ దేశాల స‌ర‌స‌న భార‌త్(India) స‌గ‌ర్వంగా త‌లెత్తుకుని నిల‌బ‌డుతున్న విష‌యం తెలిసిందే. అనేక ప్ర‌యోగాల్లో భార‌త్.. అమెరికా(America), చైనా(China) స‌హా ప‌లు దేశాల‌కు దీటుగా దూసుకుపోతోంది. చంద్ర‌యాన్‌(Chandrayan).. వంటి కీల‌క ప్ర‌యోగాల‌తో ప్ర‌పంచ దేశాల దృష్టిని ఆక‌ర్షించింది. అయితే.. మాన‌వులను అంత‌రిక్షంలోకి పంపించ‌డం అనేది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌కు సాధ్యం కాలేదు. ఈ నేప‌థ్యంలో గ‌త మూడేళ్లుగా భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ(Indian Space Research Organigation-ISRO) ఆ దిశ‌గా దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలో  మిష‌న్‌ `గ‌గ‌న్‌యాన్‌`(Gaganyan) ను ప్ర‌క‌టించింది. దీనికి కేంద్ర ప్ర‌భుత్వం గ‌త ఏడాదిన్న‌ర కింద‌టే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో యుద్ధ ప్రాతిప‌దికన ఇస్రో త‌న వ్యూహాన్ని కార్యాచ‌ర‌ణ‌లోకి తీసుకువ‌చ్చింది. ఈ ప్ర‌యోగం వాస్త‌వానికి ఈ ఏడాది చివ‌రి నాటికే చేప‌ట్టాల్సి ఉంది. అయితే.. కొన్ని కార‌ణాల‌తో దీన్ని వ‌చ్చే ఏడాదికి వాయిదా వేశారు. 

తాజాగా ఏం జ‌రిగింది? 

దేశం స‌గ‌ర్వంగా భావిస్తున్న గ‌గ‌న్‌యాన్(Gagan Yan) ప్ర‌యోగం ద్వారా.. అంత‌రిక్షంలోకి వెళ్లే.. వ్యోమ‌గాముల‌ను ఇప్ప‌టికే ఎంపిక చేశారు. తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) వారి పేర్ల‌ను ప్ర‌క‌టించారు. కేర‌ళ‌లో ప‌ర్య‌టిస్తున్న ప్ర‌ధాని మోడీ.. తిరువనంతపురం(Tiruvanantapuram)లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని వారిని పరిచయం చేస్తూ.. స్టాండింగ్ ఒవేషన్‌తో సత్కరించారు. 

ఆ నలుగురూ వీరే 

1) ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌
2) అంగద్‌ ప్రతాప్‌
3) అజిత్ కృష్ణన్‌ 
4) వింగ్‌ కమాండర్‌ సుభాన్షు శుక్లాలు వ్యోమనౌక(Vehicle)లో అంత‌రిక్షంలోకి వెళ్లనున్నారు. వీరంతా కూడా భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు కావ‌డం, సుదీర్ఘ అనుభ‌వం(12 సంవ‌త్స‌రాల పైబ‌డి) ఉండ‌డంతో వీరిని అన్ని కోణాల్లోనూ ప‌రీక్షించి ఎంపిక చేశారు. వీరి పేర్ల‌ను తాజాగా ప్ర‌ధాని మోదీ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. కాగా, భారత నేల నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు. 

'140 కోట్ల మంది ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తిరూపం'

తిరువ‌నంత పురంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ మాట్లాడారు. ‘విక్రమ్ సారాభాయ్‌ స్పేస్ సెంటర్ నుంచి మరొక చరిత్రాత్మక ప్రయాణాన్ని వీక్షించనున్నాం. ఈ రోజు నలుగురు వ్యోమగాములు భారత్‌కు పరిచయమయ్యారు. ఇవి నాలుగు పేర్లు కాదు. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు. 40 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. అయితే ఈసారి కౌంట్‌డౌన్‌ మనదే. రాకెట్ మనదే’ అంటూ ప్రధాని వారిని కొనియాడారు. ఇక, మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించబోతున్న తరుణంలో.. గగన్‌యాన్‌ మన అంతరిక్ష రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చనుందని ప్రధాని తెలిపారు. ఈ రంగంలో భారత `నారీ శక్తి` కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. మహిళా శాస్త్రవేత్తలు లేకుండా చంద్రయాన్‌, గగన్‌యాన్‌ వంటి మిషన్‌లను ఊహించుకోలేమన్నారు. ఇదిలావుంటే.. భార‌త అంత‌రిక్ష రంగంలో 100 శాతం విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌కు అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ఇలాంటి ప్ర‌యోగాలు మ‌రిన్ని పెరిగే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. 

ర‌ష్యా శిక్ష‌ణ‌లో.. 

భార‌త్ నుంచి అంత‌రిక్షంలోకి వెళ్ల‌నున్న న‌లుగురు వ్యోమ‌గాముల‌కు కొద్దికాలం రష్యాలో శిక్షణ ఇచ్చారు.  ISROతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ వారిని సుశిక్షితులను చేసింది. ప్రస్తుతం స్వదేశంలో ఇస్రో వారిని మ‌రింత‌గా తీర్చిదిద్దుతోంది. 2025లో జరిగే ఈ యాత్ర కోసం వారు నిరీక్షిస్తున్నారని గతంలో ఇస్రో ఛైర్మన్ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. వారిని రోదసిలోకి పంపి, మూడు రోజుల తర్వాత భూమికి తీసుకురావడం ఈ యాత్రలో కీలకాంశమని తెలిపారు. ఈ మిషన్ సాంతం వారు ఎలాంటి అస్వస్థతకు గురికాకుండా చూసేందుకు శారీరక దృఢత్వం కోసం శిక్షణ ఇచ్చారు.  

గ‌తంలోనూ..

గతంలో కూడా  రాకేశ్‌శర్మ భారత్‌ తరఫున అంతరిక్షంలోకి వెళ్లారు. క్షేమంగా తిరిగి వ‌చ్చారు.అంతేకాదు..  భార‌త్ నుంచి అంత‌రిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రికార్డు సాధించారు. కానీ, ఆయ‌న భార‌తీయుడే అయినా.. ఆయ‌న పాల్గొన్న ప్ర‌యోగం.. మాత్రం  ర‌ష్యా చేప‌ట్టింది. అప్ప‌ట్లో భార‌త్ అనుమతి మేర‌కు రాకేశ్ శ‌ర్మ అంత‌రిక్షానికి వెళ్లి వ‌చ్చారు.  కానీ, ఇప్పుడు తొలిసారి భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ చేప‌ట్టిన యాత్రద్వారా.. భారతీయులు వెళ్తుండ‌డం గ‌మ‌నార్హం. 

Wednesday, March 2, 2022

ఏకంగా 500 మిలియన్స్‌తో కనీవినీ ఎరుగని రికార్డు - చరిత్ర సృష్టించిన బంగార్రాజు మూవీ

కొన్నేళ్ల క్రితం వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' మూవీ తర్వాత హిట్లను అందుకోవడంలో విఫలం అవుతున్నా.. వరుస పెట్టి ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చాడు టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున. ఈ గ్యాప్‌లో ఆయన ఎన్నో వైవిధ్యమైన కథలతో మూవీలు చేశాడు. కానీ, అవేమీ సక్సెస్ ట్రాక్‌ను మాత్రం ఎక్కించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం 'బంగార్రాజు' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్కినేని నాగ చైతన్య కూడా నటించిన ఈ సినిమాకు మంచి టాక్‌ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. దీంతో ఈ సినిమా హిట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడీ మూవీ మరో కనీవినీ ఎరుగని రికార్డును నమోదు చేసింది. ఆ వివరాలు మీకోసం!


సంక్రాంతి బరిలో బంగార్రాజు
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కల్యాణ్ కృ😫💇ష్ణ కురసాల రూపొందించిన సినిమానే 'బంగార్రాజు'. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయింది.


టాక్ ఉన్నా కష్టాలు వచ్చాయి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'బంగార్రాజు' మూవీకి ఆరంభం నుంచే మంచి టాక్ వచ్చింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల ఇష్యూ, నైట్ కర్ఫ్యూతో పాటు యాభై శాతం ఆక్యూపెన్సీ ఉండడంతో ఇది కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపించింది. దీంతో నైజాంలో మంచిగా వసూళ్లను సాధించినా.. ఆంధ్రాలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.


ఎట్టకేలకు టార్గెట్ పూర్తి చేసి


భారీ బడ్జెట్‌తో రూపొందిన 'బంగార్రాజు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ నెల రోజుల తర్వాత ఈ మూవీ టార్గెట్ చేరుకుని హిట్ అయింది. దీంతో నాగార్జున సక్సెస్ ట్రాక్ ఎక్కగా.. చైతూ మరో హిట్‌ను అందుకున్నాడు.





ఈ ఏడాది ఫస్ట్ హిట్‌గా నిలిచి

కరోనా ప్రభావం పెరిగిన కారణంగా ఈ సంక్రాంతికి పెద్దగా సినిమాలు రాలేదు. వచ్చిన వాటిలో 'బంగార్రాజు' మాత్రమే భారీ చిత్రం. అందుకే ఈ చిత్రానికి బిజినెస్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగానే జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా టార్గెట్‌ను ఫినీష్ చేసి సత్తా చాటింది. దీంతో 2022వ సంవత్సరంలో హిట్ అయిన మొదటి చిత్రంగా ఇది ఘనతను సాధించింది.


ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెస్పాన్స్

సంక్రాంతి కానుకగా వచ్చిన 'బంగార్రాజు' మూవీ థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసింది. ఎన్నో అంచనాలతో వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకుంది. ఇక, ఇటీవలే ఈ సినిమా అందులో డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. అక్కడ కూడా ఈ చిత్రానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది.

చరిత్ర సృష్టించిన సినిమా

'బంగార్రాజు' మూవీకి జీ5లోనూ దీనికి భారీ స్పందనే దక్కుతోంది. దీంతో 24 గంటల వ్యవధిలోనే ఎక్కువ వ్యూస్‌ను అందుకుంది. తద్వారా అందులో ఎక్కువ క్లిక్స్ సంపాదించుకున్న ఏకైక సినిమా అరుదైన రికార్డును నమోదు చేసింది. ఇక, ఇప్పుడు ఇది 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను పూర్తి చేసింది. తద్వారా జీ5లో ఈ ఘనత అందుకున్న ఏకైక సినిమా చరిత్ర సృష్టించింది.

Source Filmybeat

Tuesday, February 22, 2022

'భీమ్లా నాయక్‌' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ న్యూ డేట్‌.. ఎప్పుడంటే!!

 Bheemla Nayak Pre release Event New Date:

                            పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్‌ చిత్రం 'భీమ్లా నాయక్‌'. ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సోమవారం(ఫిబ్రవరి 21న) జరగాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంతో ఆయన గౌరవార్థంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పవన్‌ కల్యాణ్‌తో పాటు చిత్ర యూనిట్‌ తెలిపింది.

అయితే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. అసలు ఈవెంట్‌ను నిర్వహిస్తారా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అలాంటి అనుమానాలకు చెక్‌ పెడుతూ చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఫిబ్రవరి 23 (బుధవారం) నాడు సాయంత్రం ఈ కార్యక్రమాన్ని యూసుఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లోనే నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Source :Sakshi